Saturday, May 18, 2024

యాదాద్రిలో తొలిసారి ఉత్తర ద్వార దర్శనం.. భారీగా వచ్చిన భక్తులు

spot_img

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారు ఉత్తదారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6.48 గంటలకు అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా ఉత్తర దర్శనం భక్తులకు మహాద్భుతంగా జరిగింది అర్చక బృందం వేదమంత్ర పఠ నాలతో సాంబ్రాణి పోగలతో స్వామివారు భక్తులకు ఆద్భుతంగా కనిపించారు. దర్శన సమయం లో జై నరసింహ జై జై నరసింహ అంటూ భక్తులు హర్షద్వానాలతో స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా, సీఎం ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాత గుట్ట దేవాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు.

Latest News

More Articles