Saturday, May 18, 2024

మీ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయాం.. మమ్మల్ని కూడా ఆదుకోండి

spot_img

శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ‘ఖుషి’ సక్సెస్ ఫుల్‎గా దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1 విడుదలైంది. ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 70 కోట్లు రాబట్టింది. దాంతో ఖుషి టీమ్ ఫుల్‌ జోష్‌లో ఉంది. అయితే సినిమా సక్సెస్ కావడంతో సోమవారం వైజాగ్‎లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో ఒక కోటి రూపాయలను ఓ వంద కుటంబాలకు పంచుతానని వెల్లడించాడు.

కాగా.. విజయ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయామని, తమను కూడా ఆదుకోవాలని ఓ నిర్మాణ సంస్థ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయ్ హీరోగా నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాను పంపిణీ చేసి రూ. 8 కోట్లు నష్టపోయామని, తమకూ సాయం అందించాలంటూ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌ ట్వీట్‌ చేసింది.

‘డియర్‌ విజయ్‌ దేవరకొండ! వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు నష్టపోయాం. కానీ, దానిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు మీరు మీ ఖుషి సినిమా విజయోత్సాహంతో కోటి రూపాయలను వంద కుటుంబాలకు పంచుతానన్నారు. అదేవిధంగా మీ సినిమా ద్వారా నష్టపోయిన మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలకు కూడా సాయం చేసి ఆదుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ట్వీట్‌లో పేర్కొంది.

Latest News

More Articles