ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న కోహ్లీ.. మరో రికార్డు మీద కన్నేశాడు. వన్డే క్రికెట్లో సచిన్ టెండూల్కర్కు సమానంగా 49 సెంచరీలు చేసిన ఈ రన్ మెషిన్.. మరో సెంచరీ చేసి అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
#WATCH | Karnataka: ICC Men’s Cricket World Cup | Ahead of India Vs Netherlands, 49 cut-outs of Indian cricketer Virat Kohli showing his 49 centuries, put up at M Chinnaswamy Stadium in Bengaluru. pic.twitter.com/ixA4dy2J6n
— ANI (@ANI) November 12, 2023
ఈ రోజు వన్డే క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా భారత్-నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కూడా సెంచరీ చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డు బద్దలు కానుంది. వన్డే క్రికెట్లో 50 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా కోహ్లీ పేరిట అత్యంత అరుదైన రికార్డు నమోదు కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ 49 సెంచరీలకు ప్రతీకగా అభిమానులు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర 49 కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ల ముందు సింగిల్గా, గ్రూపులుగా ఫొటోలు దిగుతూ క్రికెట్ ప్రేమికులు సందడి చేస్తున్నారు. కాగా.. కోహ్లీ కటౌట్ల కోసం చేసిన ఫొటోల ఎంపికలో ఆయన అభిమానులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లుగా కనిపిస్తున్నది. మొదటి సెంచరీ నుంచి 49వ సెంచరీ వరకు.. ఏ సెంచరీకి సంబంధించిన ఫొటోను ఆ సెంచరీ కటౌట్గా తీసుకున్నారు.