యువ గ్రాండ్మాస్టర్ డి గుకేశ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తాజాగా ఫిడే ప్రకటించిన ర్యాంకింగ్స్ లో గుకేశ్ 8వ స్థానానికి చేరాడు. ఈ క్రమంలో దాదాపు 37 ఏళ్లపాటు భారత్ తరఫున టాప్ ర్యాంకర్గా కొనసాగుతున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రికార్డును గుకేశ్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం గుకేశ్ 2,758 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకోగా.. విశ్వనాథన్ ఆనంద్ 2,754 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్ తరఫున టాప్ ప్లేయర్గా గుకేశ్ నిలిచాడు.
ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ 1986 జులై నుంచి భారత్ నంబర్వన్ ఆటగాడిగా ఉన్న రికార్డును ఇప్పుడు గుకేశ్ అధిగమించాడు. గత ఆగస్ట్ 1 నుంచి మూడు స్థానాలను గుకేశ్ మెరుగుపర్చుకున్నాడు. చెస్ ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరింది.