హైదరాబాద్: భారత దేశంపైన ఎలినినో ప్రభావం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న తెలిపారు. దీంతో టెంపరేచర్స్, ఉక్కపోతా అనేది బాగా పెరుగుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఇదెక్కడి దారుణం..పుట్బాల్ కోసం విద్యార్థులకు రెండురోజులు భోజనం పెట్టలేదు..!!
దక్షిణ భారతదేశంలో వర్షాలు పడకపోవడానికి నైరుతి ద్రోణి అనేది ఉత్తర భారతము దిశగా ఉండటం, మరొక్కటి ఎలినినో ప్రభావం అని వివరించారు. నవంబర్, డిసెంబర్ నాటికీ ఎలినినో పీక్ స్టేజ్ కి వెళ్ళుతుందని, మార్చి వరకు ఇది కొనసాగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 3, 4,5వ తేదీలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు.