Monday, May 20, 2024

ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఓ యువకుడు సూసైడ్.!

spot_img

ప్రియురాలితో మాట్లాడుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూర్ కు చెందిన ఇమ్రేజ్ పటేల్ కొన్నేళ్లుగా రాజేంద్రనగర్ లోని పరమారెడ్డిహిల్స్ లో నివాసిస్తున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఓ యువతిని ప్రేమిస్తున్నాడు ఇమ్రేజ్ పటేల్. కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ యువతి ఇమ్రోజ్ ను దూరం పెట్టింది.

ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఇమ్రేజ్ పటేల్ మంగళవారం రాత్రి తాను నివస్తున్న ఫ్లాట్ నుంచి యువతికి ఫోన్ చేసి మాట్లాడాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే ఆమె అక్కడి దగ్గరలో ఉండే మరో ఫ్రెండ్ కు ఫోన్లో విషయం చెప్పి అతని ఫ్లాట్ కు వెళ్లమని కోరింది. ఆయన వెళ్లి చూసేసరికి అప్పటికే ఇంట్లో దుప్పటితో ఉరేసుకుని ఇమ్రోజ్ సూసైడ్ చేసుకున్నాడు. ఇమ్రోజ్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:ఇది కదా మ్యాచ్ అంటే..హైదరాబాద్ చేతిలో లక్నో చిత్తు చిత్తు.!

Latest News

More Articles