పెళ్లైన దగ్గరి నుంచి భర్తే ప్రాణపదంగా భావిస్తూ బతుకుతుంది భార్య. అలాంటి భర్త ఉన్నట్టుండి చనిపోతే.. భరించలేక ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయి చివరికి ఉసురు తీసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read Also: 56 ఏండ్ల వయసులో డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న మాజీ ఎమ్మెల్యే
రహీంపురాకు చెందిన అమన్కుమార్ సింగ్ (36), అప్పర్ ధూల్పేట ఆరాంఘర్ కాలనీకి చెందిన అస్మిత (31) భార్యాభర్తలు. వీరికి రోనక్, రిత్విక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గచ్చిబౌలిలో ప్రైవేటు ఉద్యోగం చేసే అమన్కుమార్ సింగ్.. గత నెల 26న రాత్రి ఒక్కసారిగా బీపీ ఎక్కువై బ్రెయిన్ స్ట్రోక్తో మృతిచెందాడు. అప్పటి నుంచి అస్మిత మానసిక వేదనను అనుభవిస్తోంది. భర్త ఫొటోను దగ్గర పెట్టుకొని బాధపడుతూనే ఉంది. చివరికి మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఆరాంఘర్లోని పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.