Monday, May 20, 2024

ఇద్దరు కొడుకులకు చెరో రూ. 500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి

spot_img

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ తన ఇద్దరు కొడుకులకు దాదాపు రూ.500 కోట్ల విలువైన షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చేశారు. గత వారం వరకూ 22.58 కోట్ల షేర్లు కలిగి ఉన్న అజీం ప్రేమ్‌జీ.. తన ఇద్దరు కొడుకులు రిషాద్ ప్రేమ్‌జీ, తారిఖ్ ప్రేమ్‌జీలకు ఒక్కొక్కరికి 51,15,090 షేర్లు బహుమతిగా ఇచ్చేశారు. వీరిలో రిషాద్ ప్రేమ్‌జీ.. విప్రో చైర్ పర్సన్‌గా పని చేస్తుండగా.. తారిఖ్ ప్రేమ్‌జీ అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్నారు.

Read Also: 2024 ఎన్నికల ట్యాగ్‌లైన్‌ లోగోను విడుదల చేసిన ఈసీ

ఈ నెల 20న రిషాద్, తారిఖ్‌లకు అజీం ప్రేమ్ జీ షేర్లు కేటాయించారు. విప్రో షేర్ విలువ రూ.484.90 కాగా, మొత్తం 1,02,30,180 కోట్ల షేర్ల విలువ రూ.496 కోట్లు అని తెలుస్తున్నది. విప్రోలో అజీం ప్రేమ్‌జీ కుటుంబానికి 4.43 శాతం వాటా ఉంది. అందులో అజీం ప్రేమ్‌జీకి 4.12, ఆయన భార్య యాస్మిన్ ప్రేమ్‌జీకి 0.05 శాతం, ఇద్దరు కొడుకులకు 0.13 శాతం చొప్పున షేర్లు ఉన్నాయి.

Latest News

More Articles