Thursday, May 9, 2024

అసెంబ్లీలో ఫూలే విగ్రహం.. ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం

spot_img

హైదరాబాద్: మన దేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు ఫూలే కృషి సదా స్మరణీయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సమానత్వ స్ఫూర్తిని చట్టసభల స్మృతిపథంలో నిలిపే సదుద్దేశంతో తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహ ఏర్పాటు జరగాలన్నది భారత జాగృతి డిమాండ్ అని పేర్కొన్నారు. ఇది వివిధ సామాజిక సంస్థల, బీసీ సంఘాల చిరకాల కోరిక కూడా అని తెలిపారు.

Also Read.. రూ. 400 కోట్ల అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‎కు జ్యుడీషియల్‌ రిమాండ్‌

తమ డిమాండ్ కు సంఘీభావం ప్రకటిస్తున్న సంస్థలు, సంఘాలు, పార్టీల ప్రతినిధులతో ఈ నెల 26న హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తమ డిమాండ్ కు మద్దతుగా నిలిచే ప్రతిఒక్కరూ హాజరుకావాలని కవిత కోరారు. మధ్యాహ్నం 1 నుండి మాసాబ్ ట్యాంక్ లోపి ఖాజా మాన్షన్ లో సమావేశం ఉంటుందన్నారు.

Latest News

More Articles