హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ సమీపంలో గురువారం రాత్రి కారులో మంటలు చెలరేగాయి. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేశాడు. అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే బయటకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. కారులోని విలువైన వస్తువులను సైతం బయటకు తీసుకువచ్చారు. మెయిన్రోడ్డులో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గురైన స్విఫ్ట్ డిజైర్ కారు సెక్రటేరియట్లోని ఉద్యోగిదిగా సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులున్నట్లు సమాచారం.
Read also: ఇద్దరు కొడుకులకు చెరో రూ. 500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి