Friday, May 3, 2024

ప్రేమికుడి కోసం రూ. 2500 కోట్లు వదులుకున్న ప్రేయసి

spot_img

ప్రేమకు అంతస్తు అడ్డుకాదని నిరూపించింది ఓ అమ్మాయి. తాను ప్రేమించిన వాడి కన్నా.. కోట్లు తనకు ఎక్కువ కాదనుకుంది. తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడం కోసం వారసత్వంగా వచ్చే వేల కోట్లను వదిలేసుకుంది.

మలేషియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఖుకే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ ఛై దంపతుల కుమార్తె ఏంజెలిన్. ఏంజెలిన్ పై చదువుల కోసం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరింది. ఆ సమయంలో ఆమెకు జెడిడియా ఫ్రాన్సిస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఏంజెలిన్ తన తల్లిదండ్రులకు చెప్పింది. వీరి ప్రేమను ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అతన్ని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదని తేల్చి చెప్పారు. దాంతో ఏంజెలిన్.. నాకు మీ ఆస్తిలో పైసా కూడా అవసరం లేదు, నేను ప్రేమించిన వాడితోనే నా జీవితం అంటూ ఏంజెలిన్ సుమారు రూ.2,484 కోట్ల ఆస్తిని వదులుకుని ప్రియుడిని పెళ్లి చేసుకుంది.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఏంజెలిన్‎ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వాడుకొని వదలేసే వారున్న ఈ రోజుల్లో ప్రియుడి కోసం అంతటి ఆస్తిని వదులుకోవడం మామూలు విషయం కాదంటూ కామెంట్ చేస్తున్నారు.

Latest News

More Articles