హైదరాబాద్లో పట్టపగలు పేకాట ఆడుతూ మహిళలు పట్టుబడ్డారు. స్టార్ హోటల్లో రూమ్స్ ఆన్లైన్లో బుకింగ్ చేసి.. ఆఫ్ లైన్లో పేకాట ఆడుతున్న కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4లోని రాడిసన్ హోటల్లో పేకాట శిబిరాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ రైడ్లో 13 మంది పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.32 లక్షల విలువైన కూపన్లతో పాటు నగదును స్వాదీనం చేసుకున్నారు. కాగా.. పట్టుబడిన వారిలో పలువురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: మంత్రి కొండా సురేఖ పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అవమానం