Monday, May 20, 2024

భారత్ లోకి యమహా కొత్త బైక్స్..ధర చూస్తే షాకవ్వాల్సిందే..!!

spot_img

ప్రముఖ ద్విచక్ర వాహనతయారీదారు సంస్థ అయిన యమహా రెండు కొత్త బైకులను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఆర్ 3, ఎంటీ 03 పేరుతో ఈ కొత్త మోడళ్లను పరిచయం చేసింది. ఆర్ 3 మోటార్ సైకిల్ ధరను రూ. 4.64 లక్షలు ఉండగా…ఎంటీ 03 ధరను రూ. 4.59లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. జపనీస్ టెక్నాలజీ ఆధారంగా డిజైన్ చేసిన ఈ రెండు కొత్త బైకులు పూర్తిగా దిగుమతి చేసి దేశీయంగా విక్రయిస్తున్నారు. ఎక్స్ క్లూజివ్ గా బ్లూ స్వ్కేర్ డీలర్ షీప్స్ వద్ద ఈ బైకులు లభిస్తాయి.

కాగా యమహా గతంలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన ఆర్ 15ను ఆర్ 3 పోలి ఉంటుంది. ఇందులో 321 సీసీ లిక్విడ్ కూల్డ్ ట్విన్ ఇంజన్ కూడా అమర్చారు. ఇది 41.4 బీహెచ్ పీ పవర్ ను 29.06 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఇచ్చారు. ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీమాత్రం ఇవ్వలేదు. పూర్తి ఎల్ఈడీ బల్బులు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఆఫ్ సైడ్ డౌన్ ఫోర్క్ , బ్యాక్ సైడ్ మోనోషాక్ సెట్ అప్ ను అమర్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్ సదుపాయం కూడా ఉంది.

ఇక ఎంటీ 03 ఎంటీ 15ను పోలి ఉంటుంది. ఇందులో ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్ ఉంది. ఆర్ 3 తరహాలోనే ఫ్రంట్ సైడ్ ఆప్ సైడ్ డౌన్ ఫోర్క్ , బ్యాక్ సైడ్ మోనో షాక్ అమర్చారు. ఇందులో 321 సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 42 హెచ్ పీ పవర్ ను 29.5ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కూడా బ్లూటూత్ ఆప్షన్ ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: అయోధ్య రాముడికి …108 అడుగుల అగరుబత్తి..!!

Latest News

More Articles