హైదరాబాద్ : అభివృద్ధికి బాటలు వేస్తూ కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే హైదరాబాద్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చింది. గతంలో ఒక్క ఫ్లై ఓవర్ కట్టాలంటే ఏండ్లకు ఏండ్లు సమయం పట్టేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కేవలం ఏనిమిదిన్నరేళ్లలో 36 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చి భవిష్యత్ తరాలకు చెక్కు చెదరని ఆస్తిగా మలిచింది. 2015 సంవత్సరంలో రూ.5112.36కోట్ల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులు చేపట్టగా.. 36 ప్రాజెక్టులు 20 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్పాస్లు, ఏడు ఆర్వోబీ/ఆర్యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో మూడు ఇతర ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ సుడిగుండాలకు కేసీఆర్ ప్రభుత్వం శాశ్వతంగా చెక్ పెట్టింది.
Also Read.. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్ వాసులకు మెరుగైన వసతులు, భవిష్యత్ పెట్టుబడిగా నిలిచే ప్రాజెక్టులకు దాదాపు రూ.6,200కోట్ల మేర జీహెచ్ఎంసీ రుణం తీసుకున్నది. ఎస్ఆర్డీపీకి బాండ్ల ద్వారా రూ.495 కోట్లు, ఎస్బీఐ నుంచి రూపీ టర్మ్ లోన్ ద్వారా రూ.2,500కోట్లు, సీఆర్ఎంపీకి రూ.1460 కోట్లు, నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) రూ.680కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పనుల కోసం రూ.140కోట్ల మేర హడ్కో నుంచి రుణాలు తీసుకువచ్చారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ముద్ర వేసేలా తొమ్మిదిన్నరేళ్లలో ప్రగతి పథంలో నగరాన్ని నిలిపారు. ఇదంతా చేసినందుకే ఎన్నికల్లో ప్రజలు ప్రగతికే పట్టం కట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారు. గ్రేటర్లో ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవకపోవడం గమనార్హం.