హైదరాబాద్: సినిమాలలో అవకాశం పేరుతో మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సినిమాలలో అవకాశం పేరుతో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి మోసం చేయడంతో యువతి బిందుశ్రీ సూసైడ్ చేసుకుంది.
పూర్ణచంద్రరావు చేతిలో మోసపోయానని తెలుసుకుని ల్యాంకో హిల్స్ లోని 21 అంతస్తుల నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది యువతి. యువతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.