Monday, May 20, 2024

సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్‎ను చితక్కొట్టిన యువకులు

spot_img

తమ స్కూటీకి సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్‎ను ముగ్గురు యువకులు చితకబాదారు. ఈ ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. ఫారుక్ నగర్ డిపోకు చెందిన బస్సు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గండిమైసమ్మ నుండి చార్మినర్‎కు వెళ్తోంది. అదే సమయంలో ముగ్గురు యువకులు మద్యం మత్తులో స్కూటీపై వెళ్తున్నారు. అయితే తమ స్కూటీకి బస్సు సైడ్ ఇవ్వడంలేదని యువకులు స్కూటీని బస్సుకు అడ్డంగా పెట్టారు. అనంతరం డ్రైవర్‎తో వాగ్వాదానికి దిగారు. మత్తులో ఉన్న యువకులు.. డ్రైవర్ మల్లారెడ్డి మీద విచక్షణారహితంగా దాడిచేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దాడి చేస్తున్న సమయంలో స్థానికులు వీడియో తీయడంతో దాని ఆధారంగా డ్రైవర్ మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ మల్లారెడ్డి స్థానికంగా ఉన్న మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Latest News

More Articles