Saturday, May 18, 2024

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..ఒక‌రు మృతి.. 22 మందికి తీవ్ర గాయాలు!!

spot_img

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. స్పోర్ట్స్ పరేడ్ లో రక్తపుటేరులు పారాయి. సూపర్ బౌల్ విజేతగా నిలిచినందుకు కేన్సాస్ సిటీ చీఫ్స్ పరేడ్ నిర్వహిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిస్సౌరిలోని కెన్సాస్ సిటీలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ పరేడ్ లో వేలాది మంది పాల్గొన్నారు. ఎక్కడి నుంచి కాల్పులు జరిగాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అక్కడికి వచ్చినవారంతా పరుగులు పెట్టారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

కాల్పులకు తెగబడ్డ ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కేన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ మీడియాకు తెలిపారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఆటగాళ్లు, కోచ్ లు , సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు కేన్సాస్ జట్టు ప్రకటించింది.

సూపర్ బౌల్ ఛాంపియన్ షిప్ అనేది అమెరికా నేషనల్ ఫుట్ బాల్ లీగ్ లో ఒక భాగం. గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో కేన్సాస్ జట్టు శాన్ ఫ్రాన్సిస్కోపై నెగ్గింది. దీంతో ఆ జట్టు వియోజత్సవాలను నిర్వహించింది. ప్రతిఏటా సూపర్ బౌల్ చాంపియన్ షిప్ జరుగుతుంది.

ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్ న్యూస్…మరింత తగ్గిన బంగారం ధర..!!

Latest News

More Articles