Monday, May 20, 2024

తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 11% వృద్ధి

spot_img

ఢిల్లీ: 2022 డిసెంబర్ నెల జీఎస్టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,49,507 కోట్లు జీఎస్టీ వ‌సూలైంది.

ఇందులో సీజీఎస్టీ రూ. 26,711 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 33,357 కోట్లు, ఐజీఎస్టీ రూ. 78,434 కోట్లు, సెస్ రూపంలో రూ. 11,005 కోట్లు రూపంలో వసూలైనట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది.

గతేడాది డిసెంబర్ నెలతో పోల్చితే ఈ ఏడాది 15% వృద్ధి నమోదు చేసుకున్నది. ఈ డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.4,178 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

గతేడాది డిసెంబర్ నెలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 11% వృద్ధి నమోదు కావడం గమనార్హం.

Latest News

More Articles