ప్రధాని మోదీపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విరుచుకుపడ్డారు. కొత్త దేశానికి కొత్త జాతిపిత అని చెప్పుకుంటున్న మోదీ దేశానికి ఏం చేసిండని, చెప్పుకోదగినదేమైనా చేశారా అని ఆయన నిలదీశారు.
‘‘దేశ స్వాతంత్య్రం కోసం బీజేపీ, ఆరెస్సెస్ వాళ్లు ఏం చేశారు. స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర జీరో. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్రను మనం మర్చిపోగలమా? బీజేపీ పాలనలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత నెల 21న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమృతా ఫడ్నవీస్.. ఈ దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, గత కాలపు భారత దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అయితే, నూతన భారత దేశానికి జాతిపిత నరేంద్ర మోదీ అని అన్నారు.