కాంతార హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో కిరిక్ పార్టీ మూవీతో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మిక అనతి కాలంలోనే బాలీవుడ్ లో దూసుకెళ్తూ.. ఏకంగా ముంబైకి మకాం మార్చేసింది. అయితే మొన్నామధ్య ఒక బాలీవుడ్ ఛానల్ తో మాట్లాడుతూ.. తనకి గుర్తింపు తీసుకొచ్చిన కన్నడ ప్రేక్షకులు, రిషబ్ శెట్టిలను అవమానించేలా మాట్లాడిందని రష్మికపై వివాదం నడుస్తుంది. కనీసం తనకి బ్రేక్ ఇచ్చిన రిషబ్ శెట్టి పేరు కూడా చెప్పటానికి కూడా ఆమె ఇష్టపడలేదని.. ఏకంగా రష్మికని కన్నడ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కన్నడిగులు. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి సైతం స్పందిస్తూ.. మనకి అవకాశం ఇచ్చిన వారిని మరిచిపోవటం చీప్ మనుషులు చేస్తారని రష్మికకు అప్పట్లో కౌంటర్ ఇచ్చాడు. దీంతో రష్మికపై మరింత ట్రోలింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి రష్మికని టార్గెట్ చేశాడు రిషబ్ శెట్టి.
రష్మికకు హీరోయిన్గా బ్రేక్ ఇచ్చిన కిరిక్ పార్టీ చిత్రం విడుదలై ఆరేళ్లు అవుతున్న సందర్భంగా తాజాగా ట్వీట్ చేసాడు రిషబ్ శెట్టి. ఇందులో రష్మిక పేరు లేదు, తన అకౌంట్ కి ట్యాగ్ ఇవ్వలేదు. రష్మిక హీరోయిన్ అన్న సంగతే పక్కనపెట్టి టీమ్ అందరికి కృతఙ్ఞతలు తెలిపాడు. రిషబ్ మాట్లాడుతూ.. ‘‘మా మూవీ రిలీజై ఆరేళ్లు అవుతుంది. థియేటర్స్లో మీరు మా కోసం చేసిన సందడి, వేసిన విజిల్స్ను మరచిపోలేం. మా చెవుల్లో ఇంకా మారు మోగుతున్నాయి. ఆరోజుల్లోకి మమ్మల్ని తీసుకెళ్లాయి. ఈ సెలబ్రేషన్స్లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అని మెసేజ్ పెట్టారు రిషబ్ శెట్టి. దీంతో పాటు హీరో రక్షిత్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్, నిర్మాణ సంస్థ పరమ్వహ్ స్టూడియోస్ పేరుని ట్యాగ్ చేశాడు. కానీ రష్మిక మందన్న పేరుని ట్యాగ్ చేయలేదు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరోసారి రష్మిక మందన్నకు రిషబ్ కౌంటర్ ఇచ్చారని నెటిజన్స్ అంటున్నారు.