ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 113 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియరాలేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వారి వివరాలు సేకరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
రైళ్ల దుర్ఘటనలో కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఏపీ ప్రయాణికులు 482 మందిలో 267 మంది క్షేమంగా ఉన్నారని.. ఇందులో విశాఖలో దిగాల్సినవాళ్లు 309 మంది ప్రయాణికులున్నారని చెప్పారు. 82 మంది ప్రయాణం రద్దు చేసుకున్నారని ఆయన తెలిపారు.
ఇక యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో ఏపీకి చెందిన 89 మంది ప్రయాణికులున్నారని తెలిపారు. కాగా రైలు ప్రమాదంలో ఏపీ వాళ్లు చనిపోయినట్లుగా సమాచారం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆయా రైళ్లలో ప్రయాణించినవారి కుటుంబసభ్యులు మరిన్ని వివరాలకు హెల్ప్లైన్ను సంప్రదించాలని మంత్రి బొత్స సూచించారు.