Friday, May 17, 2024

రువాండాలో వరదల బీభత్సం.. 135 మంది మృతి

spot_img

తూర్పు ఆఫ్రికా దేశమైన రువాండాలో భారీగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు వరదలలో రువాండాలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ మీడియా వెల్లడించింది. వర్షాల కారణంగా నదులు ప్రమాదకర స్థాయికి చేరుకోగా.. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి.

అయితే, వరదల్లో కొంతమంది కొట్టుకుపోయారని.. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా.. చిత్తడి నేలలు, లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రజలకు ప్రభుత్వం అలెర్ట్ జారీ చేసింది.

Latest News

More Articles