Saturday, May 11, 2024

జాతీయస్థాయిలో కీలక పార్టీగా బీఆర్ఎస్..ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణం

spot_img

హైదరాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం.. ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ.. అనేక రాజకీయ ఒడిదుడుకులను తట్టుకొని, ప్రతి ఒక్క పౌరుడి మద్దతుతో లక్ష్యాన్ని సాధించిందన్నారు. తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 105 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో కీలక పార్టీగా ఎదిగిందని ఆమె ట్వీట్‌ చేశారు.  సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞతతో ఈరోజు అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తున్నదని కవిత పేర్కొన్నారు.

Latest News

More Articles