Saturday, May 18, 2024

ఇజ్రాయెల్‌ దాడుల్లో 14 మంది మృతి

spot_img

హమాస్‌ను తుదముట్టించమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం భీకర దాడులు చేస్తోంది. శనివారం ఇజ్రాయెల్‌ సైన్యం జబాలియాలోని ఓల్డ్‌ గాజా స్ట్రీట్‌లో ఇజ్రాయెల్‌ ప్రయోగించిన వైమానిక దాడుల్లో సుమారు 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ చేస్తున్న ప్రతిదాడుల్లో హమాస్‌ వైపు ఇప్పటివరకు 18,700 మందికిపైగా మరణించినట్లు హమాస్‌ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Latest News

More Articles