హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు పథకం రచించిన 16 మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. ఇందులో భోపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ కు చెందిన 5మంది ఉన్నారు. మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. వారినుండి మొబైల్ ఫోన్లు, లాప్టాప్ లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఇస్లామిక్ జిహాదీ సాహిత్యాన్ని నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారిని తదుపరి విచారణ నిమిత్తం భోపాల్ తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.