Friday, May 10, 2024

మర్పల్లి విద్యార్థుల చదువుకి ఎంపీ రంజిత్ రెడ్డి చేయూత

spot_img

వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన విద్యార్థులకి చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి అండగా నిలిచారు. హైదరాబాద్ ఇంటర్ సిటీ ట్రైన్ మర్పల్లిలో ఇటీవల ఎంపీ రంజిత్ రెడ్డి, రైల్వే జీఎంకి చేసిన విజ్ఞప్తితో ఆగగా… ఇదే సమయంలో తాను ఒక 100 మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి  రూ. 2,400 విలువ గల ట్రేన్ పాసులకయ్యే పైసలను తానే భరిస్తానని చెప్పడంతో స్థానికంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనసున్న మంచి వ్యక్తి, మా ఎంపీ రంజిత్ సర్ అంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Latest News

More Articles