Saturday, May 18, 2024

మెక్సికోలో బోల్తాపడిన బస్సు.. 18 మంది మృతి

spot_img

మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. అక్కడి కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వెనెజులా నుంచి వలసదారులతో మెక్సికో-అమెరికా సరిహద్దు ప్రాంతానికి వెళ్తున్న ఓ బస్సు.. ఓక్సాకా -ప్యూబ్లా హైవేపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 29 మంది గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 55 మంది ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు వెనెజులా, హైతీ దేశానికి చెందినవారుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Read Also: ఫ్లిప్‌కార్ట్ వ్యాన్ నుంచి గాల్లోకి రూ. 2 వేల నోట్లు.. వీడియో వైరల్

Latest News

More Articles