Sunday, May 19, 2024

రాగి చెంబు చూపి.. రూ.2.85 కోట్ల మోసం

spot_img

హైదరాబాద్‌: విలాసవంత జీవితానికి అలవాటుపడ్డ ఓ వ్యక్తి సరికొత్త మోసానికి తెరలేపాడు. అద్భుత శక్తి ఉన్న రాగి చెంబు తమ వద్ద ఉందని రియల్టర్‌ను నమ్మించి రూ.2.85 కోట్లకు ముంచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లికి చెందిన నల్లబోలు విజయ్‌కుమార్‌ రియల్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. వచ్చే కమీషన్ డబ్బుతో జల్సాలు చేసేవాడు.

Aslo Read.. దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి అండగా కేటీఆర్

ఈక్రమంలో పంజాగుట్టలోని ఓ పబ్బులో అతనికి పటాన్‌చెరుకు చెందిన రియల్టర్‌ కిరణ్‌ పరిచయమయ్యాడు. భూమిపై పిడుగులు పడ్డప్పుడు ఏర్పడ్డ శకలాలతో తయారు చేసిన రాగి చెంబు తన వద్ద ఉందని చెప్పాడు. అది డబ్బును ఆకర్షిస్తుందని.. దానిని రూ.3 కోట్లకు విక్రయిస్తానని చెప్పాడు.

కిరణ్ ను నమ్మించేందుకు తన బామ్మర్ది సంతోశ్‌, ఐటీ ఉద్యోగి రాయుడు సాయి భరద్వాజ్‌, మౌలాలికి చెందిన సురేందర్‌లతో కలిసి నాటకం ఆడించాడు. రాగి చెంబుకు అద్భుత శక్తులు నిజమేనని తాము స్వయంగా చూశామంటూ వారు కిరణ్‌ను నమ్మించారు.

Also Read.. శృంగార అంగీకార వయసును తగ్గించొద్దు

కిరణ్‌ దీన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. 2021 అక్టోబరులో రూ.50 లక్షలు ఇచ్చాడు. ఆతర్వాత రూ.90 లక్షలు, రూ.12.4 లక్షలు, రూ.1.30 కోట్లు.. ఇలా ఆరు నెలల్లో రూ.2.85 కోట్లు ఇచ్చాడు. కానీ, విజయ్‌కుమార్‌ రాగి చెంబు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన కిరణ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విజయ్‌, భరద్వాజ్‌, సురేందర్‌, సంతోశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

Latest News

More Articles