ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేత.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీకి సిద్ధం చేసిన ప్రెషర్ కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుక్కర్లపై కాంగ్రెస్ నేత కంది సంజీవరెడ్డి ఫొటోలు ముద్రించి ఉన్నది.
Read Also.. పాముకాటు మందులు.. గర్బిణుల ఆరోగ్యంపై మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు..!
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన 2000 కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు గోదాంపై దాడి నిర్వహించినట్లు వన్ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా నిలువ ఉంచిన వాటిని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పజెప్పనున్నట్లు తెలిపారు.