Friday, May 17, 2024

మణికొండ లాంకో హిల్స్ లో యువతి ఆత్మహత్య

spot_img

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి ఆత్మహత్య చేసుకున్నది. మణికొండ లాంకో హిల్స్ లో నిన్న అర్ధరాత్రి 21వ అంతస్తు పై నుంచి దూకింది బిందుశ్రీ (28). తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.  అయితే, బిందుశ్రీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

బిందుశ్రీ తూర్పు గోదావరి జిల్లాకు చెందినది. లాంకో హిల్స్ 15 LH బ్లాక్ లో గల పూర్ణ చందర్ రావు ఇంట్లో  చిల్డ్రన్ కేర్ టేకర్ గా పనిచేస్తున్నది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు రాయదుర్గం పోలీసులు వెల్లడించారు.

Latest News

More Articles