హైదరాబాద్: రవీంద్రభారతిలో అనన్య పోల్సాని కూచిపూడి మొదటి నృత్య ప్రదర్శన ద్వారా రంగప్రవేశం చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ మేనకోడలు అనన్య పోల్సాని. ఈ కార్యక్రమానికి సీఎం కెసిఆర్ సతీమణి శోభమ్మ హాజరయ్యారు.
అదే విధంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్ కుమార్ దంపతులు, ఎమ్మెల్సీ కవిత దంపతులు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సంగీత నాటక అకాడమి చైర్మన్ దీపికా రెడ్డి హాజరయ్యారు. వీరితోపాటు అనన్య పోల్సాని తల్లిదండ్రులు శ్రీనివాస్ రావు, సౌమ్య, గ్రాండ్ పేరెంట్స్ వెంకట్ రామారావు, భారతి, రవీందర్ రావు,శశికళలు హాజరయ్యారు.