Friday, May 17, 2024

పెళ్లి అంటే గానభజాన అనుకున్నారా? ఏడడుగులు నడవాల్సిందే:సుప్రీం

spot_img

హిందూ పెళ్లిలు అంటే ఆటపాటలు..విందు భోజనాలు కానేకాదని..అదొక పవిత్ర మతపరమైన ప్రక్రియ అని సుప్రంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న నేత్రుత్వంలోని ధర్మాసనం హిందూ వివాహ ప్రాముఖ్యత, చట్టబద్ధతను వివరించింది. హిందూ వివాహం అనేది సప్తపది చుట్టూ ఏడు అడుగులు నడిచే ప్రక్రియతో ముడిపడి ఉంటుందనిస్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హిందూ వివాహాన్ని నమోదు చేయడం వల్ల వివాహానికి రుజువు లభిస్తుందని తెలిపింది. కానీ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం పెళ్లిలు జరగాలి. అంటే పెళ్లి వేడుకలో సప్తపది తప్పకుండా నిర్వహించాలి. అలా కాదంటే ఆ వివాహానికి చట్టబద్దత లభించదని చెప్పింది.

హిందూ పెళ్లి ఒక సంస్కారమైన మతకర్మ..ఇది భారతీయ సమాజంలో గొప్ప విలువకలిగిన సంస్థ. అది దాని హోదాను పొందాల్సి ఉంటుంది. అత్యంత వైభవోపేతంగా పెళ్ళి నిర్వహించినా..చట్టం ద్రుష్టిలో నిబంధనలే ప్రామాణికం. పరస్పర గౌరవం, భార్యాభర్తల మధ్య బంధం వివాహపవిత్ర లక్షణం. అందుకే ఆ వేడుక సముచిత మర్యాదలతో నిర్వహించాలని సుప్రీంకోర్టు తెలిపింది. పెళ్లి చేసుకునే వధువు, వరుడు వివాహ వ్యవస్థలోకి అడుగుపెట్టే ముందు దాని గురించి లోతుగా ఆలోచన చేయాలని ధర్మాసనం వెల్లడించింది. భారతీయసమాజంలో పెళ్లి అనేది పాటు, డ్యాన్స్, విందు, కట్నాలు, కానుకల కోసమే చేసే తంతు కాదని చెప్పింది. వివాహంఅనేది వాణిజ్యపరమైన లావాదేవి కాదని..ఒక గంభీరమైన కుటుంబ వ్యవస్థకు పునాది అని తెలిపింది. భవిష్యత్తులో కుటుంబంగా మారే భార్యభర్తలు హోదాను పొందే స్త్రీ , పురుషుల మధ్య సంబంధాన్ని హిందూ వివాహం ఏర్పరుస్తుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‎కు ఓటెయ్యం..మొన్న ఓటేసి మోసపోయినం.!

Latest News

More Articles