ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ సమీపంలో రైలు ఢీకొని సుమారు 40 గొర్రెలు మృతి చెందాయి. చనిపోయిన గొర్రెల విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెల దొడ్డి గెట్ తీయటంతో రైలు పట్టాల వైపు వెళ్లాయని, దీంతో రైల్ ఢీకొన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.