Tuesday, May 14, 2024

తమిళనాడులో అగ్నిప్రమాదం..9మంది దుర్మరణం

spot_img

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరియలూరు జిల్లాలోని విరగలూరు గ్రామంలోని ఓ బాణాసంచా యూనిట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించారు.

Also Read.. సిక్కింలో తెలంగాణ వాసులు సేఫ్.. ఫలించిన తెలంగాణ కృషి

ఇదిలా ఉండగా.. మృతుల కుటుంబాలకు సీఎం ఎంకే స్టాలిన్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు, ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని తంజావూరు మెడికల్‌ కాలేజీలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు.

 

Latest News

More Articles