Sunday, May 19, 2024

సమరానికి మేం సిద్ధం.. మీరు సిద్ధమా..!

spot_img

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత తెలంగాణపై తన నిబద్ధతను బలోపేతం చేసేందుకు భారత రాష్ట్ర సమితి మరోసారి సిద్ధమైందని ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత సోమవారం తెలిపారు. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో EC ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై కవిత ట్వీట్ చేస్తూ..

‘మరోసారి తెలంగాణ పట్ల మా నిబద్ధతను బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది” అని అన్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించాలని లక్ష్యంగా ఇప్పటికే యావత్ తెలంగాణలో పక్క ప్రణాళికలు రచించింది.

Latest News

More Articles