Tuesday, May 21, 2024

బీఆర్ఎస్ గెలుపుతో గోషామహల్ అభివృద్ధి

spot_img

హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్. తన 9 ఏండ్ల ఎమ్మెల్యే పదవిలో నియోజకవర్గానికి ఏ ఒక్క అభివృద్ధి కార్యకమం చేసినట్లు నిరూపించినా.. తన వంతుగా 11లక్షల నగదు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. దీనికి సంబంధించి..ఆబిడ్స్ లోని జీపీఓ కార్యాలయం ఎదురుగా 11లక్షల చెక్కు పోస్టర్ కార్డుతో వినూత్న నిరసన చేపట్టారు. గోషామహల్ అభివృద్ధి చేయడంలో రాజసింగ్ విఫలమయ్యారన్నారు. రాజాషింగ్ డబ్బుల కోసం ఏమైనా చేస్తాడన్నారు.

మతం పేరు,దేవుడిని అడ్డం పెట్టుకొని అమాయక ప్రజలను రాజాషింగ్ మోసం చేస్తున్నాడని విమర్శించారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. రానున్న రోజుల్లో రాజాషింగ్ ను ఓడించి గోషామహల్ కు పట్టిన దరిద్రాన్ని తొలగిస్తామన్నారు. బీఆర్ఎస్ గెలుపుతో గోషామహల్ కు అభివృద్ధికి బాటలు అని అన్నారు.

Latest News

More Articles