Saturday, May 18, 2024

ఖమ్మం జిల్లాలో లారీని  కారు ఢీ కొని ముగ్గురు మృతి

spot_img

ఖమ్మం జిల్లాలోని కొణిజర్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ(గురువారం) కొనిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని.. కారు  ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కొణిజర్ల నుంచి వైరా వెళ్తుండగా ప్రమాదం జరిగిందని..ఎదురుగా వెళ్తున్న లారీ బ్రేకు వేయడంతో కారు ఢీకొన్నదని, దీంతో కారు వెనక వస్తున్న మరో లారీ దానిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

మృతులు వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, కుమారుడు అశ్విత్ గా గుర్తించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles