Saturday, May 18, 2024

మిడ్‌ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లలు, తల్లి ఆత్మహత్య

spot_img

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో విషాదం జరిగింది. శభాష్‌పల్లి వంతెన దగ్గర మిడ్‌ మానేరు జలాశయంలో  దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య  చేసుకుంది. మృతుల్లో నాలుగు నెలల పసికందు కూడా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles