ఖమ్మం జిల్లా పాల్వంచలోని సుగుణ ఫంక్షన్ హాల్ లో మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి మంత్రి హరీశ్ రావు పోడు పట్టాలను గిరిజన రైతులకు పంపిణీ చేశారు.
ఖమ్మం జిల్లాలో 13,139 ఎకరాలు సాగుచేసుకుంటున్న 6,589 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. సమైక్య పాలనలో పోడు పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు పడిన ఆదివాసీలు పట్టాలు అందుకుని సంతోషం వ్యక్తం చేశారు. భయంభయంగా గడిపిన చోటే ఇప్పటి నుంచి దర్జాగా బతుకుతామంటూ సంబురపడుతున్నారు. తమకు బతుకుదెరువు కల్పించిన సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటూ తెలిపారు.
మధ్యాహ్నం 3:30 గంటలకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలోనూ ఖమ్మం జిల్లా గిరిజన రైతులకు పోడు భూముల హక్కు పత్రాలు అందజేయనున్నారు మంత్రి హరీశ్ రావు.