Sunday, May 19, 2024

మహారాష్ట్రలో విషాదం. 24గంటల్లో 18మంది మృతి..!

spot_img

మహారాష్ట్రలోని ఠానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో 24గంటల వ్యవధిలో 18మంది మృతి చెందారు. ఈ మరణాలపై పురపాలక శాఖ కమిషనర్‌ అభిజిత్‌ బంగార్‌ ఆదివారం సాయంత్రం విచారణకు ఆదేశించారు. మృతుల్లో 10 మంది మహిళలు ఉండగా.. ఎనిమిది మంది పురుషులు ఉన్నట్టు తెలిపారు.

ఇప్పటివరకు మృతి చెందిన వారిలో ఠానే నగరానికి చెందినవారు ఆరుగురు ఉండగా.. కల్యాణ్‌కు చెందినవారు నలుగురు, షాపూర్‌ నుంచి ముగ్గురు, భీవాండి, ఉల్హాస్‌నగర్‌, గోవండి (ముంబయి) నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

Latest News

More Articles