సౌదీఅరేబియాలో ఉన్న ఓ వ్యక్తి తన భార్యతో మాట్లాడేందుకు వీడియో కాల్ చేశాడు. కాల్ మాట్లాడుతుండగా…అతని చూపు భార్య కనుబొమ్మలపై పడింది. ఆగ్రహానికి గురైన భర్త…భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ విచిత్ర ఘటన కాన్పూర్ లో వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుండగా… ఒక్కసారిగా అతని కళ్ళు భార్య కనుబొమ్మల మీద పడ్డాయి. భార్య కనుబొమ్మలను చూసిన వెంటనే ఆగ్రహించిన భర్త ఫోన్లో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఇప్పటికే వరకట్న వేధింపులతో సతమతమవుతున్న భార్య.. ఇప్పుడు దీని కోసం కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తోంది.
బాధిత మహిళ ప్రకారం, ఆమె భర్త 4 అక్టోబర్ 2023 రాత్రి మాట్లాడటానికి వీడియో కాల్ చేసాడు. మాట్లాడుతున్నప్పుడు, మహిళ భర్త ఆమె కనుబొమ్మలను చూశాడు. దీ ఆగ్రహానికి గురై ఫోన్ కట్ చేశాడట. కొంతకాలం తర్వాత సాధారణ కాల్ చేసి, ట్రిపుల్ తలాక్ చెప్పాడని బాధిత మహిళ తెలిపింది. తాను ఐబ్రోస్ చేయించుకోలేదని చెప్పినా తన భర్త తన మాట వినలేదని, తనకు విడాకులు ఇచ్చాడని మహిళ వాపోయింది.
ఈ విషయం కాస్తా బాద్షాహినాక్ పోలీస్ స్టేషన్కు చేరింది. 2022 జనవరిలో మహ్మద్ సలీంతో తనకు వివాహమైనట్లు గుల్సాబా అనే బాధిత మహిళ చెప్పింది. ఆగస్టు 30, 2023న ఆమె భర్త సౌదీ అరేబియా వెళ్లాడు. ఇక్కడ ఆమె అత్తమామలు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. అత్తమామలతో విసిగిపోయిన ఆమె ప్రయాగ్రాజ్ నుండి తన తల్లిగారి ఇంటికి కాన్పూర్కి తిరిగి వచ్చింది.
ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ ఆల్కహాల్ మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది…!!