Saturday, May 18, 2024

మొయినాబాద్ యువతి మృతి కేసులో కొత్త మలుపు!

spot_img

మొయినాబాద్ యువతి మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. యువతి అనుమానాస్పద మృతిని  పోలీసులు అత్మహత్యగా తేల్చారు. డిప్రెషన్ తోనే సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మల్లేపల్లి నుండి మొయినాబాద్ వరకు యువతి ఓలా ఆటో బుక్ చేసుకుని వచ్చిందన్నారు.

Also Read.. ఏసీబీకి చిక్కిన యాదాద్రి భువనగిరి డీటీఓ

ఇంటి నుండి చనిపోవాలి అని డిసైడ్ అయ్యి పెట్రోల్ కూడా వెంట తీసుకొచ్చిందని, మొయినాబాద్ లో ఆటో డ్రైవర్ కు 1100 రూపాయలు చెల్లించింది. పలు కారణాలతో యువతి కొద్ది నెలలుగా డిప్రెషన్ లో ఉన్నదని తెలిపారు. గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నదని పేర్కొన్నారు. హబీబ్ నగర్ లో ఈనెల 8 నుండి కనిపించకుండా పోయిన యువతి.. మొయినాబాద్ ఫారెస్ట్ లో సగం కాలిన స్థితిలో లభించింది. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

Latest News

More Articles