Sunday, May 19, 2024

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం

spot_img

ముంబయి:  దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డోంబివలీ ప్రాంతంలోని లోధా పలావ టౌన్‌షిప్‌లోని ఫేజ్‌-2లో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో 13వ అంతస్తులో చెలరేగిన మంటలు 18వ అంతస్తు వరకు వ్యాపించాయి.

Also Read.. నిన్న రైతు బంధు, నేడు దళితబంధు లబ్ధిదారులకు షాక్.. అకౌంట్లు ఫ్రీజ్

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని పదిహేను అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పివేశారు. అయితే, ఆ అపార్ట్‌మెంట్‌ ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. తొలి మూడు ఫ్లోర్లలో కొన్ని కుటుంబాలు నివాసం ఉండగా.. వాళ్లంతా సురక్షితంగా బయటకు వచ్చేశారు.

Latest News

More Articles