నారాయణపేట : తెలంగాణలో చిరుతల వరుస మృతి తీవ్ర కలకలం రేపుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో రెండు పులులు మృత్యువాత పడ్డ ఘటనను మరచిపోకముందే నారాయణపేట జిల్లాలో మరో చిరుత మృతి చెందింది. దామరగిద్ద మండలం కంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో రెండు చిరుతపులులు సంచరించాయి. వీటిని చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
Also Read.. అమానవీయం. చెత్తకుప్పలో దొరికిన అప్పుడే పుట్టిన మగ శిశువు
అనారోగ్యంతో ఉన్న ఒక చిరుత పంట పొలాల్లో పడిపోగా.. మరో చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అధికారులు చిరుత ఉన్న ప్రదేశానికి చేరుకునేలోగానే చిరుత మృతి చెందింది. మృతి చెందిన చిరుతకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు నివేదిక వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని తెలిపారు.