Friday, May 17, 2024

తెల్ల బియ్యం కంటే దంపుడు బియ్యం ఎందుకు మంచివో తెలుసా?

spot_img

బియ్యం అనగానే మనకు బాగా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యం గుర్తుకు వస్తాయి. కానీ ఒకప్పుడు దంపుడు బియ్యం తినేవారు. చూసేందుకు దుమ్ము పట్టినట్లుగా, ముదురు రంగులో కనిపిస్తాయి. కానీ నిజానికి అవి మంచి పోషకాలను కలిగి ఉంటాయి. వరి పొట్టు కింద ఉండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలిష్ పట్టినప్పుడు తవుడుతోపాటు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే తెల్ల బియ్యం కంటే దంపుడు బియ్యమే బెటర్ అని పరిశోధకులు చాలా కాలంగా చెబుతున్నారు.

వారానికి ఐదు అంతకన్నా ఎక్కువసార్లు తెల్లబియ్యం తీంటే మధుమేహం ముప్పు పెరుగుతున్నట్లు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్ల్ పరిశోధకులు గుర్తించారు. తెల్లబియ్యాన్ని 50 గ్రాములు తగ్గించి వాటి స్థానంలో దంపుడు బియ్యం తింటే షుగర్ ముప్పు 16శాతం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు రక్తపోటు పెరగడానికి దోహదం చేసే సోడియం పాళ్లు కూడా దంపుడు బియ్యంలో తక్కువగానే ఉంటాయి. ఇక పోషకాల పరంగా చూస్తే మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బీ3 వీటిల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిల్లోని మెగ్నీషియం, ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి, విశ్రుంఖల కణాలను అడ్డుకునేందుకు తోడ్పడే సెలీనియం కూడా దంపుడు బియ్యంలో పుష్కలంగానే ఉంటుంది. వీటిల్లోని లిగ్నాన్లనే పాలీఫెనాల్స్ చేరిన తర్వాత ఫైటో ఈస్ట్రోజన్ ఎంటెరోలాక్టేన్ గాను మారుతాయి. ఇవి క్యాన్సర్ నివారకంగా పనిచేయడమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. వీటిలోని పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల రక్తంలో గ్లూకోజు స్థాయిలు త్వరగా పెరగవు. కడుపు నిండిన భావన కలిగించడం వల్ల వెంట వెంటనే ఆకలి వేయదు.

ఇది కూడా చదవండి: ఇంద్రకరణ్ రెడ్డి.. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య లేదు

Latest News

More Articles