కొవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు ఇటీవల ఆ టీకా తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ ఒప్పుకుంది. దీంతో భారత్లో కీలక పరిణామం జరిగింది. కరోనా టీకా తీసుకున్న వారికి ఇచ్చే కోవిన్ సర్టిఫికేట్లో ఉండే ప్రధాని మోడీ ఫొటోను ఆ సర్టిఫికేట్ నుంచి తొలగించారు. చాలా అరుదైన కేసుల్లో కొవిషీల్డ్ కారణంగా .. రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నట్లు ఆస్ట్రాజెనికా కంపెనీ ఇటీవల అంగీకరించింది. కానీ భారత్లో ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకుని కోవిన్ సర్టిఫికేట్లో మోడీ ఫొటోను తొలగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ECI ఇచ్చిన ఆదేశాలతో కోవిన్ సర్టిఫికేట్ నుంచి మోడీ ఫొటోను తొలగించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ యూరోప్ దేశాల్లో వాక్స్ జెవేరియా పేరుతో టీకాను సరఫరా చేస్తోంది. ఆ టీకానే కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో అందించారు. ఇండియాలో ఆ టీకాను సీరం సంస్థ తయారు చేసింది. కొవిషీల్డ్ తొ కొన్ని అరుదైన కేసుల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నట్లు ఓ రిపోర్టు ద్వారా బయటపడింది.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన.. రీ షెడ్యూల్