పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. రోజు రోజుకు ప్రచారంలో జోష్ పెంచుతున్నారు. ఇవాళ (గురువారం) జగిత్యాల పట్టణంలో పలు వార్డుల్లో నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఐరన్ షాపులో కాసేపు బట్టలు ఇస్త్రీ చేశారు.
బీఆర్ఎస్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, ప్రతిపక్ష పార్టీల అబద్ధపు హామీలను ఎండగడుతూ ఎన్నికల ప్రచారం నిర్వచించారు. ఢిల్లీలో తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కేసీఆర్ రోడ్డు షో సంబంధించిన ఆహ్వాన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: కరోనా సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు