Monday, May 20, 2024

సిరిసిల్లలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశం..హాజరుకానున్న కేటీఆర్..!!

spot_img

నేడు సిరిసిల్లలో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అసెంబ్లీ నియోవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే నేడు సిరిసిల్లలో ఈ సమావేశం జరగనుంది. పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా శనివారం తెలంగాణ భవన్ లోనూ వరుస సమావేశాలతో కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును ఎండగట్టారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని..బీఆర్ఎస్ గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగాఉన్నారన్నారు. 6గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేసిందని..కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు అర్థమయ్యిందన్నారు.

ఇది కూడా చదవండి: అనూహ్యంగా పుంజుకున్న ఇంగ్లాండ్.. రసవత్తరంగా ఉప్పల్ టెస్ట్

Latest News

More Articles