Sunday, May 19, 2024

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య ఆత్మహత్య

spot_img

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మైలార్ దేవ్ పల్లిలోని లక్ష్మీ గూడలో జరిగింది. ధర్మేంద్ర, వేణుదేవి అనే దంపతులు స్థానికంగా నివసిస్తున్నారు. అయితే తాజాగా ధర్మేంద్ర రెండో పెళ్లి చేసుకున్నాడు. తాను ఉండగా.. భర్త మరో వివాహం చేసుకోవడాన్ని వేణుదేవి జీర్ణించుకోలేకపోయింది. తన భర్త తనకు కాకుండా పోతున్నాడని తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‎కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. ఓ పోలీస్ స్టేషన్‎లోని సిబ్బంది మొత్తం ట్రాన్స్‎ఫర్

Latest News

More Articles