హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైనా ఒకరు లేదా ఇద్దరు ట్రాన్స్ఫర్ అవుతారు, కానీ ఒకేసారి స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డుల దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ వరకు అందరినీ ఏఆర్కు అటాచ్ చేస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.
Read Also: ట్రక్కును ఢీకొన్న బస్సు.. 19 మంది దుర్మరణం
బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ కేసుతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారనే ఆరోపణలు కూడా ఈ స్టేషన్ సిబ్బంది ఉన్నాయి. దాంతో స్టేషన్లోని 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. ఇలా ఇంతమందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమించినట్లు సమాచారం.